వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణకు సోనియా గాంధీ, కేసీఆర్ టార్గెట్‌గా అక్కడ బహిరంగ సభ!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల చివరి వారంలో ఆమె పర్యటన ఉండే అవకాశముంది. ఈ నెల 23వ లేదా 30వ తేదీన ఆమె పర్యటన తెలంగాణలో ఉండనుంది. గజ్వేల్ లేదా సూర్యాపేటలో ఆమె సభ ఉండే అవకాశముంది. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కార్యకర్తలు, నేతల్లో ఉత్సాహం నింపేందుకు ఆమె తెలంగాణలో పర్యటించనున్నారు.

Sonia Gandhi tour in Telangana in this month end

<strong>కొండా సురేఖకు మద్దతు, ఎర్రబెల్లికి సెగ, తెరపైకి కడియం కావ్య: అసంతృప్తులు, రంగంలోకి కేటీఆర్</strong>కొండా సురేఖకు మద్దతు, ఎర్రబెల్లికి సెగ, తెరపైకి కడియం కావ్య: అసంతృప్తులు, రంగంలోకి కేటీఆర్

తెలంగాణ ఇస్తామని సోనియా గతంలో ప్రకటించి, ఆ హామీ నిలబెట్టుకున్నారని ఈ సభ ద్వారా కాంగ్రెస్ నేతలు చెప్పనున్నారు. సోనియా సభ గురించి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోను సోనియాతో సభలు నిర్వహించాలని భావిస్తున్నారు. సోనియా తర్వాత ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీతోను సభను నిర్వహించనున్నారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని గతంలో జనాల్లోకి పూర్తిగా తీసుకు వెళ్లడంలో విఫలమైనందున, ఈసారి ఆ పొరపాటు జరగకుండా చూసుకుంటున్నారు.

వ్యూహాత్మకంగానే గజ్వెల్‌లో సభ

కాంగ్రెస్ పార్టీ నేరుగా కేసీఆర్‌ను టార్గెట్ చేసే ఉద్దేశ్యంతోనే సోనియా గాంధీతో గజ్వెల్‌లో బహిరంగ సభ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గజ్వెల్లో కుదరకుంటే సూర్యాపేటలో సభ ఉండనుందని అంటున్నారు.

English summary
UPA chairperson Sonia gandhi may tour in Telangana in this month end. Telangana Congress leaders are trying for Sonia public meeting in Gajwel or Suryapet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X